“ఫ్రెండ్లీ పోలీస్” అని ప్రత్యక్షంగా నిరూపించిన జమ్మికుంట పోలీసులు.జీన్యూస్ జమ్మికుంట
సహజంగా పోలీసులంటే ప్రజలలో భయం, అలాగే పోలీసులు కఠినంగా ఉంటారని సమాజంలో ఒక రకమైన భావన. కానీ ప్రజలలో వున్న ఆ అభిప్రాయాన్ని తప్పు అని నిరూపించారు జమ్మికుంట పోలీసులు. జమ్మికుంట మండలానికి చెందిన రాజేందర్ అనే రైతు బుధవారం రోజున ట్రక్కులో వడ్ల బస్థాలను స్థానిక మార్కెట్ కు తరలిస్తుండగా జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ మీదకు రాగానే వడ్ల బస్తాలు జారీ రోడ్డు మీద పడిపోయాయి. వాహన రాకపోకలకు కొంత ఇబ్బంది కలిగిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న పట్టణ సి ఐ, రామకృష్ణ గౌడ్ వెంటనే స్పందించి ఎస్.ఐ తో సహా మిగతా పోలీస్ సిబ్బంది ని సంఘటన స్థలానికి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వడ్ల బస్థాలను తామే మోస్తూ ట్రక్కు లోనికి ఎక్కించారు. సకాలంలో స్పందించి సహాయం చేసిన జమ్మికుంట పోలీసులను స్థానిక ప్రజలు, పలువురు అభినందించారు.
నెల రోజుల్లో టి స్క్వేర్ పనులు ప్రారంభం కావాలి
– సీఎం రేవంత్ రెడ్డి
జీ న్యూస్
టి స్క్వేర్ ఏఐ హబ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. నవంబర్ నెల నాటికి టి స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. 24 గంటల పాటు టి స్క్వేరపని చేయాలన్నారు. ఇవాళ హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్లో ఏ హబ్ టి స్క్వేర్ పై సమీక్షించి 24 గంటల పాటు టీ స్క్వేర్ పనిచేయాలని, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వీ హబ్ నిర్మాణం కోసం జై కా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. విహబ్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విహబ్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి
ప్రభుత్వం తక్షణం స్పందించాలి....
ఆత్మబలిదానాలు సరికాదు
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య
జీ న్యూస్ హుజూరాబాద్
ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లకోసం చేస్తున్న ఉద్యమంలో ఆత్మబలిదానం చాలా బాధకరమని, ఆత్మబలిదానాలు వద్దని ఓపికతో కొట్లాడి...
సత్తా చాటిన సింగపూర్ కిట్స్ విద్యార్థులు
16 మంది విద్యార్థులకు నగదు బహుమతులు కైవసం
జీ న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న...
రాధాస్వామి సత్సంగం కు స్టీల్ ప్లేట్ల పంపిణీ
జీ న్యూస్ హుజురాబాద్
గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాధాస్వామి సత్సంగ్లో శనివారం ప్లేట్లు పంపిణీ చేశారు....