
డిప్యుటీ డీఎంఆండ్హచ్ఓ కు వాకర్స్ కమిటీ సన్మానం
జీ న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ డిప్యుటీ డీఎంఆండ్హచ్ఓ గా నియమితులైన డాక్టర్ శ్రావణ్ కుమార్ ను గురువారం హుజూరాబాద్ వాకర్స్ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్థానికుడైన శ్రావణ్ కుమార్ వైద్యుడిగా నిరుపేదలకు గొప్ప సేవలు అందించాడన్నారు. వైద్య సేవలతో పాటు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమాలు నిర్వహించాడన్నారు. డివిజన్ పరిధిలో చాలా మంది యువకులకు కళాకారులుగా అవకాశాలు కల్పించి వెలుగులోకి తెచ్చాడని ప్రశంసించారు. అందరితో కలివిడిగా ఉండే శ్రావణ్ విధి నిర్విహనలో ఖచ్చితత్వంతో తనదైన శైలిలో రాణించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తాడన్నారు. ఈ సందర్బంగా ఆయను శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి అభింనదనలు అందజేశారు. కార్యక్రమంలో వాకర్స్ కమిటీ కార్యదర్శి మతిన్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఉపాద్యక్షులు యాదగిరి, సాయి, సంయుక్త కార్యదర్శి సంపత్, గౌరవ సలహాదారు సృజన్ తదితరులు పాల్గొన్నారు.

