అభివృద్ది కోసం అంజిరెడ్డిని గెలిపించుకుందాం…రేవూరి ప్రకాశ్ రెడ్డి

జీ న్యూస్ హనుమకొండ
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, వెంకటేశ్వర్ల పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాని పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. శుక్రవారం హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజిరెడ్డి, వార్డ్ మెంబర్ల గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. వెంకటేశ్వర్ల పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజి రెడ్డి ఉంగరం గుర్తు, వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రజ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు గద్దెనెక్కగానే ప్రజలను మరచి పోయి, అభివృద్ధి ముసుగులో దోచుకున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఆయా గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500లకే గ్యాస్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ప్రతి రూపాయి ఖర్చు పెడుతుందన్నారు .
