ప్రైవేటుకు ధీటుగా చర్లపల్లి ప్రభుత్వ పాఠశాల

Must read

ప్రైవేటుకు ధీటుగా చర్లపల్లి ప్రభుత్వ పాఠశాల
భారతీయ సాంప్రదాయానికి ప్రతీక ముగ్గు

జీ న్యూస్​ నడికుడ

భారతీయ సాంప్రదాయానికి ప్రతీకలు ముగ్గులను చెప్పవచ్చని నడికూడ మండలం ఎంపీఓ మార్గవి అన్నారు. నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ముగ్గుల పోటీని నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నడికూడ మండలం ఎంపీఓ మార్గవి మాట్లాడుతూ ముగ్గు అనేది ఇంటి వాకిలి ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయమన్నారు. స్త్రీలు ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి, తడిగా ఉండగానే పిండితో ముగ్గులు వేస్తారని, గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని, సుద్ధముక్కలను గాని తడిపి వేస్తారన్నారు. ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారని, ఇవి రోజు వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయన్నారు. కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన, గోడల అంచుల వెంబడి వేసుకుంటున్నారన్నారు. ఎన్ని వేసినా ఇంటి ముందు పండుగల వేల రంగురంగులతో వేసే హరివిళ్లు లాంటి ముగ్గులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ప్రైవేటుకు దీటుగా చర్లపల్లి పాఠశాల
నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ కున్సోత్ హనుమంతరావు, ఎంపీఓ మార్గవిలు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులతో కూడిన క్యాలెండర్ను ముద్రించడం అభినందనీయమన్నారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తుందని పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో లకవత్ దేవ, పుల్లూరి రామకృష్ణ, అరుణ్ కుమార్, కందికట్ల రమ, భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య, వద్యార్థి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

More articles

Latest article