నూతన సర్పంచ్లకు సన్మానం
జీ న్యూస్ హుజురాబాద్
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన పలువురు సర్పంచ్ లను వాకర్ అసోసియేషన్ సభ్యులు గురువారం సన్మానించారు. స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో వాకర్ అసోసియేషన్ సభ్యులుగా ఉండి..ఇటీవల జరిగిన ఎన్నికలలో రాజపల్లి గ్రామ సర్పంచ్గా కట్కూరి మల్లారెడ్డి, రాములపల్లె సర్పంచ్గా అనుమల్ల రాంరెడ్డి, ఎలబోతారం సర్పంచ్ గా రవీందర్ లు విజయం సాదించారు. కాగ వారు హుజూరాబాద్ వాకర్ అసోసియేషన్లో అక్టివ్ మెంబర్లుగా కొనసాగుతున్నారు. ఈ సందర్బంగా వాకర్ సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడే వాకర్ సభ్యులు సర్పంచ్ లుగా గెలవటం ఆనందంగా ఉందన్నారు. వారు గ్రామాలను అభివృద్ది చేస్తూ గ్రామస్థులను ఆరోగ్యంగా ఉండేలా పలు కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్య గ్రామ పంచాయతీలుగా, గ్రీన్ పంచాయతీలుగా మార్చాలని కోరారు. కార్యక్రమంలో బండ శ్రీనివాస్, పుల్లూరి ప్రభాకర్ రావు, వర్దనేని రవీందర్ రావు, ఎంఏ మథిన్, గొవర్దన్, తాళ్లపల్లి శ్రీనివాస్, రాజిరెడ్డి, సారయ్య, కుమార స్వామి, చింత శ్రీనివాస్, ఎర్రం రాజన్న, కొలిపాక శ్రీనివాస్, పాక సతీష్, పల్కల ఈశ్వర్ రెడ్డి, రత్నం, ప్రభాకర్, మహేష్, సాదుల రవీందర్ రావు, సదానందం, ఉప్పు శ్రీనివాస్, గొపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
