సిద్దార్థ హైస్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జీ న్యూస్ చెన్నారావుపెట
చెన్నారావుపేట మండలంలోని సిద్దార్థ ఉన్నత పాఠశాలలో బుదవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ కంది గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి ఆద్వర్యంలో కేకును కట్ చేసి చిన్నారులతో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోదనలు ప్రపంచంలో ప్రేమతత్వాన్ని పెంచాయన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
