మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం
జీ న్యూస్ లోకేశ్వరం
మంగళవారం అబ్దుల్లాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు కొంత సమయం అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం(/06/01/2026)విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని లైన్మెన్ సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని లైన్మెన్ సాయిబాబా విజ్ఞప్తి చేశారు
