కిషన్ రెడ్డికి క్లబ్ సభ్యుల నివాళి
జీ న్యూస్ హుజూరాబాద్
ఇటీవల మృతి చెందిన హుజూరాబాద్ క్లబ్ సంయుక్త కార్యదర్శి చొల్లేటి కిషన్ రెడ్డి కి క్లబ్ సభ్యులు ఆదివారం మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. క్లబ్ ఆరవణలో ఉదయం కిషన్ రెడ్డి స్మారక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపి మాదవి మాట్లాడుతూ కిషన్ రెడ్డి అందరితో కలివిడిగా ఉంటూ సందడి చేసేవారన్నారు. క్లబ్ కార్యక్రమాలలో ఆయన చురుకుగా ఉండేవాడని, ఆయన లేని లోటు స్పంష్టంగా కనిపిస్తుందన్నారు. సభ్యులు మాట్లాడుతూ కిషన్ రెడ్డితో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తర తమ బేదాలు లేకుండా అందరిని కలుపుకుపోయి, అరమరికలు లేకుండా ఉండేవాడన్నారు. కిషన్ రెడ్డి ఉన్నంత సేపు లాఫింగ్ క్లబ్లా మారిపోయేదని, సందడిగా ఉండేదని గుర్తుకు చేసుకున్నారు. ఎవరికి చిన్న సమస్య వచ్చినా తాను మందుకు వచ్చి వారికి దైర్యం చెప్పి, అండగా ఉండేవాడన్నారు. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే కిషన్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

